‘పోలవరం ప్రాజెక్టు అథారిటీపై సుప్రీంకు’ | Sakshi
Sakshi News home page

‘పోలవరం ప్రాజెక్టు అథారిటీపై సుప్రీంకు’

Published Thu, May 8 2014 3:20 AM

Odisha Government mulling to file writ petition in Supreme Court over Polavaram

భువనేశ్వర్, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా సర్కారు మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. గోదావరి నదిపై తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేయాలని నిర్ణయించినట్లు ఒడిశా జలవనరుల శాఖ మంత్రి సురేష్ మొహపాత్రా బుధవారం తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement