కశ్మీర్ కాల్పుల్లో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

కశ్మీర్ కాల్పుల్లో ఒకరి మృతి

Published Sat, Apr 18 2015 11:25 AM

కశ్మీర్ కాల్పుల్లో ఒకరి మృతి - Sakshi

జమ్మూ కశ్మీర్: వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలంను అరెస్టుకు  నిరసనగా జరుగుతున్న ఆందోళన ఉద్రిక్త రూపం దాలుస్తోంది.  బద్గాం జిల్లా నర్బాల్లో శనివారం  జరిగిన పోలీసు కాల్పుల్లో  ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి.  పలువాహనాలు నిప్పుపెట్టిన అందోళనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వటంతో కాల్పులు జరిపినట్టు భద్రతా వర్గాలు  తెలిపాయి.

కాగా పాకిస్తాన్ జెండాను ప్రదర్శించి, పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన ఆరోపణలపై  వేర్పాటువాద నాయకుడుమస్రత్ అలంను శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో మరో సెపరేటిస్ట్ నేత  గిలానీ, మసరత్ ఆలం అరెస్టుకు నిరసనగా శనివారం బంద్ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
One killed,  security forces, firing,  Kashmir. కశ్మీర్,  కాల్పులు, ఒకరు మృతి

Advertisement
Advertisement