సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులపై కాల్పులు | Sakshi
Sakshi News home page

సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులపై కాల్పులు

Published Thu, Feb 18 2016 8:21 PM

సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులపై కాల్పులు

అసోం: అసోంలో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులపై గురువారం ఓ ముఠా కాల్పులకు తెగబడింది. గౌహతి పల్టాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సైబరాబాద్‌ పోలీసులపై ఆన్‌లైన్‌ కాంట్రాక్ట్‌ ముఠా కాల్పులకు యత్నించింది. దాంతో  ప్రమాదం తప్పింది. ఈ కాల్పుల నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్‌ పోలీసులు.. చాకచక్యంగా ఇద్దరు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను రేపు (శుక్రవారం) హైదరాబాద్‌కు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు తరలించనున్నారు. పట్టుబడిన నిందితులు విపుల్‌ అలీ, భాస్కర్‌ చక్రవర్తిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాగా సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement