Sakshi News home page

ఆరుగురు తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు

Published Mon, Jan 26 2015 3:51 AM

కోట శ్రీనివాసరావు, మిథాలీరాజ్, సింధు, డాక్టర్లు నోరి, మంజుల, రఘురాముడు

న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. ఆరుగురు తెలుగు వారు పద్మశ్రీ అవార్డులకు  ఎంపికయ్యారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు ఒక్క తెలుగు ప్రముఖుడు కూడా ఎంపికకాలేదు.

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనవారిలో కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిని మిథాలిరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement