అదుపులో ఐదుగురు పాకిస్థానీయులు | Sakshi
Sakshi News home page

అదుపులో ఐదుగురు పాకిస్థానీయులు

Published Mon, Jun 5 2017 5:55 PM

అదుపులో ఐదుగురు పాకిస్థానీయులు - Sakshi

జైపూర్‌: ఐదుగురు పాకిస్థాన్‌ వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు తీరినప్పటికీ దేశంలో తచ్చాడుతున్న వారిని అరెస్టు చేశారు. రాజస్థాన్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఖాజో బిల్‌(60), చందు బిల్‌(75), దాయి బాయి బిల్‌(70), నరేశ్‌ బిల్‌ (10), ధార్మి బాయి(12) అనే ఐదుగురు జోద్‌పూర్‌ వెళ్లడానికి మాత్రమే వీసా అనుమతి ఉన్నప్పటికీ బార్మర్‌కు వారు వెళ్లారు.

ఆ తర్వాత జోద్‌పూర్‌ వెళ్లేందుకు గోద్రా రోడ్డు రైల్వే స్టేషన్‌ వద్ద ఎదురు చూస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా వీసా ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వాస్తవానికి బార్మర్‌ ప్రాంతంలో విదేశీయులకు నిషేధం. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి వారు అక్కడ రెండు రోజులపాటు ఉన్నారు. ఖాజో, నరేశ్‌ బిల్‌ రెండేళ్ల కిందటే జోద్‌పూర్‌ రాగా, మరో ముగ్గురు మాత్రం 20 రోజుల కిందటే వచ్చారు.

Advertisement
Advertisement