పాక్ కాల్పుల్లో అనంతపురం జవాను మృతి | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పుల్లో అనంతపురం జవాను మృతి

Published Fri, Oct 17 2014 10:31 AM

Pakistani troops violate ceasefire by resorting to firing on Indian post

శ్రీనగర్ : పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ పూంఛ్ జిల్లాలోని బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ శుక్రవారం కాల్పులు జరిపింది. అయితే  పాక్ కాల్పులను భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు.

 కాగా పాక్ సైన్యం కాల్పుల్లో అనంతపురం జిల్లాకు చెందిన ఓ జవాను మృతి చెందాడు. జవాను అనీల్ కుమార్ స్వస్థలం అనంతపురం జిల్లా తలుపుల మండలం తూపల్లి గ్రామం.  గతరాత్రి అనీల్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement