కోర్బా/సంబల్పూర్: ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడటం ఆ గొప్ప వంశానికి అలవాటేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీలంతా దొంగలెందుకయ్యారు?’అన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా ఆయన ఈ మాటలన్నారు. ప్రధాని మంగళవారం ఒడిశాలోని భాటాపర, సంబల్పూర్, ఛత్తీస్గఢ్లోని కోర్బాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
మాట్లాడదగిన భాషేనా అది?
మోదీ పేరున్న ప్రతి వారినీ దొంగే అని పిలవడంపై ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సాహు కులస్తులను గుజరాత్ మోదీ అని, రాజస్థాన్లో రాథోడ్లని పిలుస్తుంటారు. మోదీ పేరున్న ఎవరైనా వారి దృష్టిలో దొంగే. మాట్లాడదగిన భాషేనా ఇది? చౌకీదార్ను అవమానించేందుకు, జనంతో చప్పట్లు కొట్టించుకునేందుకు ఏకంగా ఓ కులంపై దొంగ అనే ముద్ర వేస్తున్నారు. రేపు బీసీలను, గిరిజనులను దూషిస్తారు. అట్టడుగు వర్గాల వారిని బానిసలుగా చూస్తూ కించపరచడం ఈ రాచ కుటుంబానికి అలవాటే’అని మండిపడ్డారు. అవహేళన చేయడమనే అలవాటున్న ఇలాంటి వారిని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఒక్క ఓటు ద్వారానే అవన్నీ సాధ్యం
ప్రజలిచ్చిన ఒక్క ఓటు శక్తితోనే ప్రభుత్వం పాక్పై వైమానిక దాడి, సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టడంతోపాటు, అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చి వేయడం వంటి సాహసోపేత చర్యలకు పూనుకుందని ప్రధాని మోదీ అన్నారు. శత్రుదేశం ఉపగ్రహాన్ని కేవలం మూడు నిమిషాల్లోనే కూల్చివేయగల సత్తా ఇప్పుడు భారత్కు ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో సైనిక బలగాల ప్రస్తావన తీసుకు రావద్దంటూ అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ గతవారం నిర్దేశం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వంపై నిప్పులు
ఛత్తీస్గఢ్లో బీజేపీ ఎమ్మెల్యేను మావోయిస్టులు పొట్టనబెట్టుకోవడంపై ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మావోయిస్టులు ఏకమయ్యారని ఆరోపించారు. అదేవిధంగా పేదలకు ఆరోగ్య సేవలు అందకుండా చేసేందుకు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం అమలును నిలిపివేసిందని తెలిపారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలను విస్మరించటంలో కాంగ్రెస్ పార్టీ పీహెచ్డీ చేసిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఒడిశాలోని పట్నాయక్ ప్రభుత్వం పీఎం–కిసాన్ పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.
అవహేళన వారి అలవాటు
Published Wed, Apr 17 2019 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement