నోయిడా/న్యూఢిల్లీ: పౌరులు వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు తమ సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ఇంధన వినియోగం తగ్గి, తద్వారా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చుతగ్గుతుందన్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాను దక్షిణ ఢిల్లీతో కలుపుతూ కొత్తగా నిర్మించిన మెజెంటా మెట్రోరైలు మార్గాన్ని మోదీ సోమవారం ప్రారంభించారు. యూపీ గవర్నర్ రామ్ నాయక్, ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ పురీ తదితరులతో కలసి మోదీ మెట్రోరైలులో ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
అప్పుడే సుపరిపాలన సాధ్యం
‘గతంలో కొందరు రాజకీయ నేతలు ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ‘నాకు ఏం లాభం?, నేనెందుకు చేయాలి?’ అని ఆలోచించేవారు. ఆ ఆలోచనా విధానాల్ని మేం రూపుమాపాం. భారత్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశమైనా, ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరకపోవడానికి కారణం సరైన పరిపాలన లేకపోవడమే. దానిని సరిదిద్దే బాధ్యతను నా భుజాలకెత్తుకున్నాను’ అని మోదీ వివరించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అప్పటికల్లా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతికి అవుతున్న ఖర్చులను తగ్గించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు.
వాజ్పేయినే తొలిసారి ప్రయాణించారు
2002 డిసెంబరు 24న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఢిల్లీలో తొలిసారిగా మెట్రోరైలును ప్రారంభించి, ప్రయాణించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. గ్రామాలకు రోడ్లు నిర్మించడం, ఆ రోడ్లను ప్రధాన రహదారులతో అనుసంధానించడం ఇవన్నీ వాజ్పేయి ఆలోచనలేననీ, అభివృద్ధి జరగాలంటే ముందుగా రవాణా సౌకర్యాలే ముఖ్యమని మోదీ అన్నారు. మెజెంటా లైన్తో దక్షిణ ఢిల్లీ, నోయిడా మధ్య ప్రయాణ సమయం గతంతో పోలిస్తే అర్ధగంటకు పైగా తగ్గనుంది. ఇప్పటివరకు నోయిడా నుంచి దక్షిణ ఢిల్లీకి 52 నిమిషాల సమయం పడుతుండగా, మెట్రో రైలులో అయితే కేవలం 19 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఢిల్లీ మెట్రోరైళ్లలో పెంచిన చార్జీలను సీఎం కేజ్రీవాల్ తగ్గించమని బహిరంగంగానే కోరతారనే భయంతోనే ఆయనను మెట్రోరైలు మార్గం ప్రారంభానికి పిలవలేదని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విమర్శించారు.
యోగికి మోదీ పొగడ్తలు
నోయిడాలో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులెవరూ మళ్లీ సీఎం కారనే ఒక మూఢనమ్మకం ఆ రాష్ట్రంలో ప్రచారంలో ఉంది. కానీ యోగి ఆదిత్యనాథ్ దానిని పట్టించుకోకుండా నోయిడాకు వచ్చారనీ, ఆయన ధైర్యవంతుడని మోదీ అన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా అచ్చం ఇలాంటి వదంతులు ఉన్న ఆరు నుంచి ఏడు ప్రాంతాలకు వెళ్లాననీ, అయినా 20 ఏళ్లు సీఎంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు.
ప్రజా రవాణాను బాగా వాడండి
Published Tue, Dec 26 2017 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement