• మాజీ ప్రధానికి మోదీ, షా, అడ్వాణీతోపాటు పలువురి పుట్టినరోజు శుభాకాంక్షలు
• పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా అటల్జీ
• వృద్ధాప్యపరమైన వ్యాధులతో మంచానికే పరిమితం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 92వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ఆయన చేసిన సేవలను, నాయకత్వ పటిమను కొనియాడారు. ఆదివారం ఆయన నివాసానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. వాజ్పేయి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ‘ప్రియతమ, గౌరవనీయులైన అటల్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. దేశ అభివృద్ధిలో, రాజకీయాల్లోనూ ఈయన ముద్ర మరువలేనిదని మోదీ ప్రశంసించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వా ణీ, కేంద్ర మంత్రులు అనంత్కుమార్, ఎస్ఎస్ అహ్లువాలియాతో పాటు పలువురు ప్రముఖులు కూడా మాజీ ప్రధాని వాజ్పే యికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మౌనంగానే మహనీయుడు
మాజీ ప్రధాని వాజ్పేయి ఎవరితోనూ మాట్లాడే స్థితిలోగానీ, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో గానీ లేరు. పదేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న వాజ్పేయి ఏడేళ్లుగా వృద్ధాప్యపరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరిసారిగా 2007లో లక్నోలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఇక్కడి కృష్ణమీనన్ మార్గ్లో ఉంటున్నారు. ఆయన దత్తపుత్రిక నమిత.. వాజ్పేయి బాగోగులు చూసుకుంటున్నారు. 2009లో వచ్చిన స్ట్రోక్ కారణంగా ఆయన మాట్లాడలేకపోతున్నారు. వాజ్పేయి సన్నిహితులు ఎన్ఎం ఘాటటే, ఎల్కే అడ్వాణీ, బీసీ ఖండూరీ తరచుగా వస్తుంటారు. 2014 డిసెంబరు 24న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించగా.. 2015 మార్చి 27న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి భారతరత్న పురస్కారాన్ని అందజేశారు.
అభివృద్ధిలో అటల్జీ ముద్ర
Published Mon, Dec 26 2016 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement