ఉత్సాహవంతులైన యువకులు కొందరు ఓ స్వామీజీ దగ్గరికొచ్చి.. 'అయ్యా.. పుణ్యలోకాల్లో నివసించే దేవుళ్ల సాక్షాత్కారం లభించాలంటే ఏం చెయ్యాలి?' అని అడిగారు. అందుకా స్వామీ ఇలా సమాధానమిచ్చారు..
'దేవుడి గుళ్లో గంటను ఎన్నిసార్లు కొట్టాలి, హారతిని కుడి నుంచి ఎడమకివ్వాలా! లేక ఎడమ నుంచి కుడికివ్వాలా! అనే చిన్న చిన్న విషయాల దగ్గరే మీరు ఆగిపోకూడదు. అవన్నీ పక్కకు నెట్టండి. అసలు ఆలయాలకు వెళ్లడమే మానేసి మైదానాలకు తరలి వెళ్లండి. వెళ్లి ఫుట్ బాల్ ఆడండి. ఉత్సాహంగా బంతిని తన్నండి. శక్తినంతా ఉపయోగించి గోల్ చేసేందుకు ప్రయత్నించండి. కేవలం ఇలాంటి ప్రయత్నాల వల్లే మీకు దైవదర్శనం లభిస్తుంది. బలమే జీవితం. బలమే జీవితం. బలహీనతే మరణం' అంటూ యువకులకు ఉద్బోధిస్తారు.
ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు ఆయన మరెవరో కాదు స్వామి వివేకానంద అని. ప్రస్తుతం మలేసియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. వికేకానంద బెంగాలీ యువతతో పంచుకున్న విషయాలను గుర్తుచేసుకున్నారు. ఆదివారం పెటాలింగ్ జయలోని రామకృష్ణ మఠంలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల దాకా భారత్ ఎదుగుదల.. తన విశ్వాసాలపై ఉంచిన నమ్మకాలతోనే సాధ్యమయిందని, ఆ విశ్వాసాలను భారతీయుల మదిలో బలంగా నాటిన వ్యక్తి వికేకానందుడని మోదీ ఉద్ఘాటించారు. వివేకానంద కేవలం ఒక వ్యక్తి కాదని, యావత్ భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, మానవసేవే మాధవ సేవ అనే నినాదమే జీవితాశయంగా బతికిన ఆయన.. ఆనాడే పాశ్చాత్య గడ్డపై ప్రబోధనలు చేశారని కొనియాడారు.
పర్యావరణ పరిరక్షణ గురించి ఎవరో చెబితే తెలుసుకునే దుస్థితిలో భారత్ లేదని, ప్రకృతిని, అందులో నివసించే పశుపక్ష్యాదులను భారతీయులు దైవాలుగా భావిస్తారని గుర్తుచేశారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం మలేసియా వెళ్లిన ప్రధాని మోదీ శనివారం ఆసియాన్ సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.
'ఆలయాలకు వెళ్లేకన్నా.. ఆటలాడటం మిన్న'
Published Sun, Nov 22 2015 4:23 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement