బెంగళూరు: రోడ్డు మీద అందమైన యువతి కనిపించిందంటే చాలు.. అటుగా వెళ్లేవారి కళ్లన్నీ ఆమెపైనే ఉంటాయి. ఇక ఆ యువతి నవ్వడం.. తనను చూసి సైగలు చేస్తే ఇంకేమైనా ఉందా..! ఇదే బలహీనతను ఓ ముఠా ఆయుధంగా చేసుకుని దోపిడీకి తెరతీసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా వారిని అరెస్ట్ చేశారు. కర్ణాటక బేగూరులోని ఏకే కాలనీకి చెందిన మోనిషా(20), పునీత్(18), మరో అపార్టుమెంటులో ఉండే ముత్తు(19), ఏడీ కాలనీకి చెందిన తులసీరాం(22), అరుణ్ యశ్రాజ్ (22), విఘ్నేష్, స్టీఫెన్, బబ్లూ, అలెక్స్, అమర్ అనే యువత ఒక ముఠాగా ఏర్పడింది.
వీరు పథకం ప్రకారం ఆకట్టుకునే కురుచ దుస్తులతో మోనిషాను నైస్ రోడ్డులోని మైలసంద్ర వంతెనకు సమీపంలోని రోడ్డు పక్కన నిల్చోమని చెబుతారు. అటుగా బైక్లపై, కార్లలో వెళ్లేవారిని చూసి నవ్వటం, సైగలు చేయటం వంటివి చేస్తుంటుంది. ఎవరైనా ఆమె వద్దకు వస్తే.. వారిని ముగ్గులోకి దించి ముఠా సూచనల మేరకు సమీపంలోని పొదల వద్దకు తీసుకెళుతుంది. అక్కడికి వెళ్లిన వెంటనే కాచుకుని కూర్చున్న గ్రూపు సభ్యులు కత్తులు, కర్రలతో దాడి చేసి మోనిషాతో వచ్చిన యువకుడి వద్ద ఉన్న నగదు, మొబైల్, ఇతర వస్తువులను లాక్కొని పంపిస్తుంటారు. ఇలా చాలా మందిని భయపెట్టి దోచుకున్నారు.
కొందరు బాధితులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇటీవల పథకం పన్ని రాత్రి 10.30 గంటల సమయంలో మాటువేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన గ్రూపు సభ్యులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు చాకులు, ఒక ఇనుపరాడ్డు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని పోలీసుల విచారణలో మోనిషా తెలిపింది. ప్రస్తుతం మోనిషా, పునీత్, ముత్తు, తులసీరాం, అరుణ్ యశ్రాజ్ పట్టుబడగా మిగతా వారు పరారీలో ఉన్నారు. త్వరలో మిగతా నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
ప్లాన్ చేసి.. అందమైన యువతిని ఎరగా వేసి..!
Published Thu, May 25 2017 7:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement