భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అతిధ్యం ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎదురుచూస్తున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, పర్యటన వివరాలను కచ్చితంగా వెల్లడించలేదు. కాగా, సోమవారం మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయానికి శుభాకాంక్షలు తెలిపారని చెప్పింది.
కాగా, ట్రంప్-మోదీలు ఫోన్లో సంభాషించుకోవడం ఇది మూడోసారి. భారత్-అమెరికా అధికారుల మాత్రం ఇప్పటివరకూ పలుమార్లు కలిసి చర్చలు జరిపారు. చర్చలు భారత్-అమెరికా సంబంధాలను మరింత మెరుగుపరిచేవిధంగా ఉన్నాయని మన అధికారులు పేర్కొన్నారు కూడా.