పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నాడు సభలో తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాతి నుంచి ఇప్పటివరకు వాళ్లంతా అసెంబ్లీలోనే ఉండిపోయారు. నేలమీదే పడుకోవడం, అక్కడే బ్రష్ చేసుకోవడం.. నిరసన కొనసాగించడం.. ఇదీ ఎమ్మెల్యేల కార్యక్రమంగా మారింది. అసెంబ్లీ హాలును ఖాళీ చేసి వెళ్లాలని ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కోరినా ఎమ్మెల్యేలు మాత్రం పట్టు వీడలేదు.
సోమవారం సభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ నుంచి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు నిరాకరించారు. అధికారంలో ఉన్న అకాలీదళ్ - బీజేపీ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద మళ్లీ కొత్తగా చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ అధికారులు మొత్తం లైట్లు, ఏసీలు ఆపేశారని, తమకు చాలా సేపటి వరకు కనీసం తిండి, నీళ్లు కూడా లేవని ప్రతిపక్ష నేత చరణ్జిత్ సింగ్ చన్నీ చెప్పారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అసెంబ్లీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే వెలుతురులోనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ.. తమకు తామే గాలి విసురుకుంటూ గడిపారు.
వచ్చే సంవత్సరం పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఇదే చిట్టచివరి సమావేశం కావడంతో ఎలాగైనా ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని కాంగ్రెస్ ఈ వ్యూహం రచించింది. మంగళవారం బక్రీద్ సెలవు కాగా, బుధవారంతో అసెంబ్లీ ముగిసిపోతుంది. సీనియర్ ఎమ్మెల్యేలు చాలామంది వెళ్లిపోయినా.. యువ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఆగిపోయారు. కాంగ్రెస్కు పంజాబ్లో మొత్తం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 27 మంది నిరసనలో పాల్గొన్నారు. వాళ్లందరికీ పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ కేఎఫ్సీ నుంచి ఆహారం పంపారు.
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల నిద్ర.. నిరసన కొనసాగింపు
Published Tue, Sep 13 2016 2:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement