రాహుల్‌కు తీవ్ర జ్వరం.. మోదీ ఆందోళన! | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు తీవ్ర జ్వరం.. మోదీ ఆందోళన!

Published Mon, May 16 2016 3:48 PM

రాహుల్‌కు తీవ్ర జ్వరం.. మోదీ ఆందోళన! - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారని తెలుసుకొని..  ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన చెందారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

'రాహుల్‌ గాంధీ బాగా లేరని తెలుసుకొని ప్రధాని ఆందోళన చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు' అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ట్విట్టర్‌లో తెలిపారు. తీవ్ర జ్వరంగా ఉండటంతో గతవారం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనను రాహుల్‌గాంధీ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాహల్‌ హై వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
 

Advertisement
Advertisement