Sakshi News home page

గెలవడానికి ఏమైనా చేస్తారు

Published Sun, Dec 13 2015 12:04 PM

గెలవడానికి ఏమైనా చేస్తారు - Sakshi

మోదీపై రాహుల్ ధ్వజం
 
 గువాహటి:  వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యం కావాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించి, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన ఏదైనా చేస్తారన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, ప్రజల్లో ఘర్షణలు పెంచి విభజించడం మోదీకి అలవాటన్నారు. ఇటీవలి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ  ఇవే జిమ్మిక్కులు ప్రదర్శించారని.. అయితే ప్రజలు వాటిని తిప్పికొట్టారని అన్నారు.

కాగా, నేషనల్ హెరాల్డ్ కేసు  వల్లే జీఎస్‌టీ బిల్లును అడ్డుకుంటున్నారా అన్న ప్రశ్నకు రాహుల్‌ను మరోచోట విలేకర్లు ప్రశ్నించగా అవి రెండూ వేరువేరు అంశాలని అన్నారు.  జీఎస్‌టీ విషయంలో తమ డిమాండ్లను పరిష్కరిస్తే బిల్లును సమర్థించడానికి అభ్యంతరం లేదన్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ వాస్తవాలను బయటపెట్టాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ ఢిల్లీలో డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement