‘ముజఫర్’ బాధితులకు రాహుల్ హితవు
ముజఫర్నగర్:అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముజఫర్నగర్ బాధితులకు హితవు చెప్పారు. ముజఫర్నగర్లో ఆదివారం రాహుల్ ఆకస్మికంగా పర్యటించారు. ఇప్పటికీ శిబిరాల్లోనే ఉంటున్న బాధితులను పరామర్శించారు. శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిందిగా సూచించారు. బాధితులు ఇంకా శిబిరాల్లోనే ఉండాలని మత ఘర్షణలకు కారకులైన వారు కోరుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితి ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. అయితే, తిరిగి తమపై దాడులు జరిగే అవకాశాలున్నాయని, అందువల్ల గ్రామాలకు వెళ్లబోమని పలువురు బాధితులు చెప్పారు. ముజఫర్నగర్, షామ్లీ జిల్లాల్లో బాధితులు తలదాచుకుంటున్న అరడజను శిబిరాలను ఆయన సందర్శించారు. బాధితుల్లో హిందువులను, ముస్లింలను కూడా రాహుల్ కలుసుకున్నారు. కాగా, షామ్లీలోని బాధితుల శిబిరం వద్ద దాదాపు 200 మంది నిరసనకారులు రాహుల్ కాన్వాయ్ని అడ్డుకుని, నినాదాలు చేశారు. ముజఫర్నగర్లో కొద్దిరోజుల కిందట రాహుల్ పర్యటించినప్పుడు పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ... అల్లర్ల బాధితుల్లోని ముస్లిం యువకులతో సంప్రదింపులు జరిపినట్లు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనలపై రాహుల్ను ప్రశ్నించగా, తమపై ప్రజలు ఆగ్రహంగా లేరని, సమాజ్వాదీ కార్యకర్తలే ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. బాధితులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు, వారికి పునరావాసం కల్పించేందుకు సమాజ్వాదీ సర్కారు చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ ఆరోపించారు. బాధితులను తాను ఎక్కడ కలుసుకున్నా, సౌభ్రాతృత్వం గురించే మాట్లాడానని చెప్పారు. భర్నౌ శిబిరంలో రాహుల్ నేల పైనే కూర్చుని, అక్కడి చిన్నారులతో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో చిక్కుకుని బడికి వెళ్లలేకపోతున్నామని వారు చెప్పారు.
అల్లర్ల కారకుల చేతిలో పావులు కావద్దు...
Published Mon, Dec 23 2013 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement