సాక్షి, ముంబై : రైల్వేలైన్ల వెంట ఉన్న పాతభవనాలు ప్రమాదకరంగా మారాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్యాండ్హస్ట్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల ఓ భవనం పాక్షికంగా కూలడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనతో సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైలు పట్టాల వెంట ఉన్న పాత భవనాలన్నింటిని గుర్తించి అధ్యయనం చేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అందుకు బీఎంసీపై ఆధారపడకుండా రైల్వే అధికారులే స్వయంగా అధ్యయనం చేసి నివే దిక రూపొందించనుంది. ఆ తరువాత ఆ నివేదికను మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి అందజేయాలని నిర్ణయించిందని సెంట్రల్ రైల్వే పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు.
వర్షాకాలంలో ముప్పు
రెండు రోజుల కిందట శ్యాండ్హస్ట్ రోడ్ స్టేషన్ ఎదుట ఉన్న థోరత్ హౌస్ భవనం కొంత భాగం కూలింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న హార్బర్ రైల్వే మార్గంపై వచ్చి పడడంతో కొన్ని గంటలపాటు లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని కూల్చివేయాలని రైల్వే గతంలోనే బీఎంసీకి సూచించింది. కానీ బీఎంసీ నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్లీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు రైల్వే ట్రాక్కు ఆనుకుని అనేకం ఉన్నాయి.
అవి వర్షాకాలంలో ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉంది. ప్రయాణికుల భద్రతకే పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే పరిపాలన విభాగానికి ఇలాంటి భవనాలు తల నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దురదుష్టవశాత్తు అవి కూలే సమయంలో రైలు వస్తే అప్పుడు ప్రమాద తీవ్రత ఘోరంగా ఉంటుంది. అందుకే ముందుగానే ఇలాంటి పాత భవనాలపై అధ్యయనం చేయాలని సెంట్రల్ రైల్వే వర్గాలు నిర్ణయించాయి. ఈ బాధ్యతలను సీనియర్ అధికారుల బృందానికి అప్పజెప్పనున్నాయి. ముందుగా ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), శ్యాండ్హస్ట్ రోడ్ స్టేషన్ పరిసరాల్లో శిథిల భవనాలపై అధ్యయనం చేయనున్నారు. ఆ తరువాత పట్టాల వెంట ఉన్న మిగతా ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో తెలిపారు.
పాతభవనాలపై రైల్వే అలర్ట్
Published Wed, Jul 16 2014 1:26 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
నీట్ పరీక్ష ఫలితాల వివాదం : రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
T20 World Cup 2024: అదే జరిగితే పాక్ క్వాలిఫయర్స్ ఆడక తప్పదు..!
బాలీవుడ్ భామ బర్త్ డే.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన భర్త!
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
T20 WC 2024 IND VS PAK: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
ఆర్ఆర్ఆర్ చాలా నచ్చింది.. ఆ హీరోతో పని చేయాలనుంది: హాలీవుడ్ డైరెక్టర్
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement