అదేంటి.. రైల్వే శాఖ ఏంటి, హత్యలు చేయించడానికి సుపారీ ఇవ్వడం ఏంటనుకుంటున్నారా? చార్బాగ్ రైల్వేస్టేషన్లో ఎలుకలను చంపడానికి నెలకు రూ. 35వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదంతా ఎందుకని మొత్తం ప్లాట్ఫారాలను తవ్విపారేస్తున్న వందలాది ఎలుకలన్నింటినీ పట్టుకుని చంపడానికి ఓ ప్రైవేటు కంపెనీకి రూ. 4.76 లక్షల కాంట్రాక్టు ఇచ్చారు. వీటివల్ల రైల్వే ఆస్తులకు, ఫైళ్లకు తీవ్రమైన నష్టం కలుగుతోంది.
ఇంతకుముందు 2013 సంవత్సరంలో కూడా ఎలుకలను చంపడానికి ఓసారి కాంట్రాక్టు ఇచ్చినా, వాళ్లు సరిగా ఆ పని చేయలేకపోయారు. గడిచిన ఏడాది కాలంలో ప్లాట్ఫారం మీద వివిధ వస్తువులు అమ్ముకునేవారికి రూ. 10 లోల వరకు నష్టం కలిగిందని, దాంతో ఈ అమ్మకందారులే కాక.. ప్రయాణికులు కూడా ఎలుకలంటే భయపడిపోతున్నారని, చివరకు క్లోక్రూంలలో భద్రపరిచిన సామాన్లను కూడా ఈ ఎలుకలు వదలడం లేదని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పుడు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు ఇన్ని ఎలుకలను చంపాలని లక్ష్యం ఏమీ పెట్టలేదని, వాళ్లు చంపిన ఎలుకలను చార్బాగ్ రైల్వేస్టేషన్ చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తారని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. ప్లాట్ఫారాల కింద ఎలుకలు ఏకంగా కాలనీలు ఏర్పాటుచేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం ఏడాది పాటు ఉండే కాంట్రాక్టులో భాగంగా కంపెనీవాళ్లు 25 సార్లు స్టేషన్కు వస్తారన్నారు.
ఎలుకలు మొత్తం అన్ని ప్లాట్ఫారాలను తవ్వేశాయని, అవి ఐదో నెంబరు ప్లాట్ఫారం నుంచి లోపలకు ప్రవేశించి, రెండో నెంబరు ప్లాట్ఫారం నుంచి బయటకు వస్తాయని సూరజ్ కుమార్ అనే వ్యాపారి చెప్పారు. ఒక్కో ఎలుక బరువు అరకిలోకు పైగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండకపోతే పిల్లలను కూడా కరుస్తున్నాయని బ్రిజేష్ సింగ్ అనే ప్రయాణికుడు చెప్పారు. ఎలుకలను చంపేవాళ్లు మొత్తం స్టేషన్లోని అన్ని ప్రాంతాల్లోను తమ పని చేస్తారని, వాటికోసం మందు కలిపిన ఆహార పదార్థాలను సిద్ధం చేస్తారని అంటున్నారు. మొదట్లో ఎలుకలను చంపే కాంట్రాక్టు ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నా.. రాను రాను వీటి బాధ మరీ భరించలేనిదిగా తయారు కావడంతో మొత్తం దాదాపు రూ. 5 లక్షలు వెచ్చించక తప్పడం లేదట.
హత్యల కోసం సుపారీ ఇచ్చిన రైల్వేశాఖ
Published Fri, Aug 19 2016 5:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement