గతంలో ఎన్నడూ లేని విధంగా డోర్ డెలివరీ విధానాన్ని రైల్వేశాఖ చేపట్టబోతోంది. ఇన్నాళ్లూ ఏదైనా పార్సిల్ బుక్ చేసుకోవాల్సి వస్తే, ఒక స్టేషన్లో బుక్ చేసి, గమ్యస్థానం వద్ద కూడా మనమే స్టేషన్కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక అలా అవసరం లేకుండా.. బుక్ చేసిన సరుకులను రైల్వే వర్గాలే నేరుగా ఇంటి వద్దకు డెలివరీ అందించే విధానాన్ని సదానంద గౌడ తన కొత్త బడ్జెట్లో ప్రకటించారు. ఇది ఒకరకంగా విప్లవాత్మకమైన మార్పే. అలాగే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సరుకు రవాణాలో కేవలం 30 శాతం మాత్రమే రైలు మార్గంలో వెళ్తోందని, ఈ వాటాను గణనీయంగా పెచుకోడానికి ప్రత్యేకంగా సరికొత్త డిజైన్లలో పార్సిల్ వ్యాన్లు తీసుకొచ్చి, వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తామని కూడా ఆయన చెప్పారు. ఇంకా, ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్లను ఏర్పాటుచేసి, ఆ మార్గాల్లో సరుకులు మాత్రమే రవాణా అయ్యేలా చేస్తామని, దానివల్ల సరుకు రవాణాకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని గౌడ తెలిపారు.
భద్రతకు పెద్దపీట వేస్తామని, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం కొత్తగా 4వేల మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించి, వారికి సెల్ఫోన్లు కూడా అందజేస్తామని ఆయన అన్నారు. వీటి సాయంతో ప్రయాణికులు ఏ కోచ్ నుంచి అయినా వారిని సంప్రదించొచ్చని వివరించారు.
ప్రయాణికుల సౌకర్యాలు
ఎఫ్ఓబీలు, ఎస్కలేటర్లను ప్రధాన స్టేషన్లలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుచేస్తామని, అన్ని స్టేషన్లలో ప్రైవేటు మార్గాల ద్వారా బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు పెడతాం. వీటివల్ల వృద్ధులు, వికలాంగులు ఏ ప్లాట్ ఫారాల మీదకైనా వెళ్లగలరని గౌడ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలో రిటైరింగ్ రూంలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని.. ఇక మీదట ప్రయాణికులు ఒక రైలును గానీ, బోగీని గానీ, బెర్తును గానీ దేన్నయినా బుక్ చేసుకోవచ్చని సభ్యుల హర్షధ్వానాల మధ్య చెప్పారు.
ఎస్ఎంఎస్ ద్వారా ఫుడ్ ఆర్డర్
ఆహారం నాణ్యత, పరిశుభ్రత పెంచేందుకు రెడీ టు ఈట్ మీల్స్ను ప్రవేశపెడతామని దీనివల్ల కేటరింగ్ నాణ్యత పెరుగుతుందని రైల్వే మంత్రి చెప్పారు. దీని నాణ్యతపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తామని, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణికుల నుంచి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. నాణ్యత లేకపోతే అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సు సైతం రద్దు చేస్తామని అన్నారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామని.. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని వివరించారు.
రైల్వే పార్సిళ్లకూ డోర్ డెలివరీ
Published Tue, Jul 8 2014 2:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement