ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్నాథ్ భేటీ | Sakshi
Sakshi News home page

ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్నాథ్ భేటీ

Published Sun, May 11 2014 11:55 AM

ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్నాథ్ భేటీ - Sakshi

న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమావేశమైన మరుసటి రోజే ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ వారితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లి రాజ్నాథ్ మంతనాలు జరిపారు. సోమవారం జరిగే తుది విడత లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ఈ నెల 16న జరిగే కౌంటింగ్ గురించి రాజ్నాథ్ ఆర్ఎస్ఎస్ పెద్దలతో చర్చించినట్టు భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు భయ్యాజీ జోషీ, సురేష్ సోనీ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో మోడీ శనివారం సమావేశమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement