భువనేశ్వర్: అత్యాచారాలను నిరోధించి, నిందితులను కఠినంగా శిక్షించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా మార్పు మాత్రం కనిపించడంలేదు. తాజాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ కామాంధుడి ఘాతుకానికి అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలిక బలైపోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భువనేశ్వర్లోని సాలియా సాహి మురికివాడలో ఓ కుటుంబం నివసిస్తోంది. అదే వాడకు చెందిన అశోక్ సాహు(22) మంగళవారం వారి దగ్గరకు వచ్చి ఓ వ్యక్తి చిరునామా చూపించాలని కోరాడు.
దీంతో ఆ కుటుంబ సభ్యులు.. నాలుగో తరగతి చదువుతున్న బాలికను అతడితోపాటు పంపించారు. అయితే అశోక్.. ఆమెను అదే మురికివాడలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఎంతసేపటికీ తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా, ఓ మైదానంలో ఆమె శవం కనిపించింది. పోలీసులు అక్కడకు సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజ్ గేటు వద్దనున్న సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా, అశోక్ సాహు నిందితుడని తేలింది. వెంటనే స్థానికులు అతడ్ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు బాధితురాలి కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసులు తెలిపారు.
అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన...
బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో ఒడిశా అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ ఘటనపై సీఎం నవీన్పట్నాయక్ క్షమాపణ చెబుతూ ఓ ప్రకటన చేయాలని విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, ఆందోళనతో సభ రెండు సార్లు వాయిదా పడింది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సభలో ఓ ప్రకటన చేశారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ బాధితురాలి కుటుంబానికి సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు.
బాలికపై అత్యాచారం, హత్య
Published Thu, Aug 22 2013 5:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement