సాక్షి, చెన్నై: గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విభజన స్వభావం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. పదవుల కోసం తగవులు పెట్టే తత్వంగల ఆ పార్టీని జాతిపిత మహాత్మా గాంధీ ఆ రోజుల్లోనే అనుమానించి దేశ స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ను రద్దు చేయాలని కోరుకున్నారని చెప్పారు. తమిళనాడులోని తిరుచ్చిలో గురువారం బీజేపీ ‘యువ కమలం’ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఎర్ర కోటను పోలినట్లుగా తీర్చిదిద్దిన సభావేదికపై నుంచి మోడీ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించి కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.
రెండు నిమిషాలపాటు తమిళంలో మాట్లాడాక హిందీ, ఆంగ్లంలో ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘దేశ స్వాతంత్య్రం కోసం ఆ రోజుల్లో హిందూ ముస్లింలు కలసి పోరాటాలు సాగించారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ను రద్దు చేయూలని గాంధీ పలుమార్లు సూచించినా ఆ పార్టీ పెద్దలు పెడచెవిన పెట్టారు. మహాత్ముడు కన్నకలలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుతం దేశ పౌరులపై ఉంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మత కల్లోలాలు, జాతి విద్వేషాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. అందువల్ల దేశానికి కాంగ్రెస్ పార్టీ చెర నుంచి విముక్తి కల్పించి ఆ పార్టీని తరిమికొట్టాలి.’’ అని మోడీ సూచించారు. ఆధార్ కార్డుల జారీలో చోటుచేసుకున్న అక్రమాలపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తాను మూడేళ్ల క్రితమే ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు.
ఆధార్ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులను ఖర్చు చేశారో ప్రధాని మన్మోహన్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ తరచూ కల్లోలాలు సృష్టిస్తోందని, జవాన్లను హతమారుస్తోందని మోడీ ఆరోపించారు. ప్రభుత్వ పేలవ విదేశాంగ విధానం వల్లే గుజరాత్, తమిళనాడులకు చెందిన జాలర్లను పాకిస్థాన్, శ్రీలంక దళాలు అక్రమంగా నిర్బంధిస్తున్నాయని విమర్శించారు. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్, తమిళనాడు శాఖ అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నినాదం కొత్తదేం కాదు
కొల్లాం (కేరళ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ‘సమ్మిళిత అభివృద్ధి’ నినాదాన్ని భుజానికెత్తుకోవడంపై మోడీ పరోక్ష విమర్శలు చేశారు. దేశానికి ఈ నినాదం కొత్తదేమీ కాదని మోడీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక ప్రబోధకురాలు మాతా అమృతానందమయి 60వ పుట్టినరోజును పురస్కరించుకొని కేరళలోని కొల్లాంలో జరిగిన సభలో పాల్గొన్న సందర్భంగా మోడీ మాట్లాడుతూ సమ్మిళిత అభివృద్ధి గురించి వేల ఏళ్ల కిందటే రుషులు ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ వంటి సందేశాలను నాటి పాలకులకు ఉపదేశించారన్నారు. మోడీ అంతకుముందు తిరువనంతపురంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేశారు.
కాంగ్రెస్పై నాడే గాంధీకి అనుమానం
Published Fri, Sep 27 2013 12:47 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement