ఐదు వారాల్లో పెట్రోల్పై రూ.4.47, డీజిల్పై రూ.6.46 పెంపు
న్యూఢిల్లీ: విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న ప్రజలు.. ఐదు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.47, డీజిల్ ధర రూ.6.46 పెంపుతో మరిన్ని కష్టాలు పడుతున్నారు. మంగళవారం లీటర్ పెట్రోల్పై రూ.2.58, డీజిల్పై రూ.2.26 పెంచడం తెలిసిందే. మే 1 నుంచి పెట్రో ధరలను పెంచడం ఇది మూడోసారి. మే 1న లీటర్ పెట్రోల్ ధరను రూ.1.06, మే 17న రూ. 0.83 పెంచారు. డీజిల్పై మే 1న రూ. 2.94, మే 17న రూ.1.26ను ఆయిల్ కంపెనీలు పెంచాయి. తాజా పెంపుతో ఈ ఏడాదిలో పెట్రో ధరలు గరిష్ట రిటైల్ రేటుకు చేరుకున్నాయి. ఇక ఏప్రిల్ 16న చివరిసారిగా ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించింది.
అప్పుడు పెట్రోల్పై రూ.0.74, డీజిల్పై రూ.1.30 పైసలను తగ్గించింది. మార్చి నుంచి ఇప్పటివరకూ పెట్రోల్ ధర రూ.8.99, డీజిల్ ధర రూ.9.79 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గినపుడు కూడా కేంద్రం పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించకుండా.. లాభాన్ని పెంచుకునేందుకు ఎక్సైజ్ సుంకాన్ని 9రెట్లు పెంచింది. దీనివల్ల పెట్రోల్పై రూ. 11.77, డీజిల్పై రూ. 13.47 ఎక్సైజ్ సుంకం పెరిగింది. కంపెనీలు పెట్రో ధరలు పెంచడంతో గోవా ప్రభుత్వం పెట్రోల్పై 20 శాతంగా ఉన్న వ్యాట్ను 15 శాతానికి తగ్గించింది. పెంపును ఉపసంహరించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
సబ్సిడీయేతర సిలిండర్పై రూ.21 పెంపు
సబ్సిడీయేతర 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 21 పెరిగింది. ఢిల్లీలో ధర రూ. 527.50 నుంచి రూ.548.50కు చేరింది. కాగా, 2016-17 బడ్జెట్లో పేర్కొన్నట్లు 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. సినిమా టికెట్లు, హోటల్ బిల్లులు, బ్యాంకింగ్ లావాదేవీలు తదిరాలపై సేవాపన్ను 15 శాతానికి చేరింది.
సామాన్యుడికి పెట్రోవాత
Published Thu, Jun 2 2016 3:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement