తెరుచుకున్న శబరిమల దేవాలయం | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న శబరిమల దేవాలయం

Published Mon, Dec 31 2018 5:37 AM

Sabarimala Temple Opens For 21-Day Festival Amid Heavy Security - Sakshi

శబరిమల: భారీ భద్రత నడుమ మకర సంక్రాంతి(మకరవిలక్కు) వేడుకల కోసం శబరిమల అయ్యప్ప దేవాలయం ఆదివారం తెరుచుకుంది. ప్రధాన పూజారి వీఎన్‌ వాసుదేవన్‌ నంబూద్రి ఆలయ తలుపులు తెరిచి పూజలు చేశా రు. తొలి రోజే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మకర సంక్రాంతి జనవరి 15న జరుగుతుంది. ఆలయాన్ని తిరిగి జనవరి 21న మూసివేస్తారు. 41 రోజుల పాటు జరిగిన మండల పూజ అనంతరం 27న ఆలయాన్ని మూసివేశారు. అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోనికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు  నేపథ్యంలో  కేరళ ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది.

Advertisement
Advertisement