‘దమ్ముంటే అయోధ్యలో పని మొదలుపెట్టండి’ | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే అయోధ్యలో పని మొదలుపెట్టండి’

Published Sat, Jan 9 2016 1:57 AM

Samajwadi Party Challenge to BJP

లక్నో: అయోధ్యలో వివాదాస్పద స్థలంలో దమ్ముంటే ఆలయ నిర్మాణ పని మొదలుపెట్టాలని ఉత్తరప్రదేశ్ అధికారపక్షం సమాజ్‌వాదీ పార్టీ.. బీజేపీకి సవాల్ విసింది. ‘వివాదాస్పద స్థలంలో ఒక్క ఇటుక పెట్టడానికి కానీ, తీయడానికిగానీ మా ప్రభుత్వం అనుమతించదు’ అని రాష్ట్రమంత్రి శివ్‌పాల్ యాదవ్ అన్నారు. బీజేపీకి దమ్ముంటే  అయోధ్యలో మందిర నిర్మాణాన్ని ప్రారంభించాలని, అలా చేస్తే రూ.10 లక్షలతోపాటు ఓ బంగారు కిరీటం చేయిస్తానని ఎస్పీ ఎమ్మెల్సీ బుక్కాల్ నవాబ్ సవాల్ విసిరారు.

కాగా, బీజేపీ ఎన్నికల హామీ మేరకు 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికల్లా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్ పేర్కొన్నారు. మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యేలా పార్లమెంటులో బిల్లు పెట్టాలని వీహెచ్‌పీ నేత సురేంద్ర జైన్ డిమాండ్ చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని ఆయన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కలసి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement