పేరు చెప్పడం మర్చిపోయిన మంత్రి | Sakshi
Sakshi News home page

పేరు చెప్పడం మర్చిపోయిన మంత్రి

Published Tue, Jul 5 2016 1:56 PM

పేరు చెప్పడం మర్చిపోయిన మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో  విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన   ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మహారాష్ట్రకు  చెందిన రామ్ దాస్ అథవాలే(56) తన పేరును చెప్పడం మరిచిపోయారు. మధ్యలో జోక్యం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆప్ కా నామ్ బోలీయే (మీ పేరు చెప్పండి) అనడంతో తేరుకున్న రామ్ దాస్  సారీ చెప్పి తన పేరుతో ప్రమాణ స్వీకారం  చేశారు. 
 

Advertisement
Advertisement