బిహార్లో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం | Sakshi
Sakshi News home page

బిహార్లో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Published Thu, Apr 28 2016 9:30 AM

బిహార్లో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం - Sakshi

పాట్నా : బిహార్ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రకియ గురువారం ప్రారంభమైంది. ఈ విడతలో బిహార్లోని 38 జిల్లాలోని 60 బ్లాకుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 59.85 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. అయితే ఇంతవరకు ఎక్కడు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదన్నారు. కాగా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో ఒకరు మరణించగా... పలువురు తీవ్రంగా గాయపడ్డిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement