సెల్ఫీ పిచ్చితో ఇద్దరు అమ్మాయిలు.. | Sakshi
Sakshi News home page

సెల్ఫీ పిచ్చితో ఇద్దరు అమ్మాయిలు..

Published Thu, Feb 25 2016 3:38 PM

సెల్ఫీ పిచ్చితో ఇద్దరు అమ్మాయిలు..

పనాజీ: సెల్ఫీ పిచ్చితో కొందరు ప్రాణాలు తీసుకోగా.. మరికొందరు కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నారు. గోవాకు విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యారు. గోవా తీర ప్రాంతం అంజునా సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఇద్దరు అమ్మాయిలు స్కఫోల్డింగ్పై కూర్చునే సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్కఫోల్డింగ్ కూలిపోవడంతో ఇద్దరూ చాలా ఎత్తుపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమ్మాయిలు ఇద్దరికీ వెన్నెముకకు తీవ్రగాయమైంది. నడుము కింది భాగాలు పక్షవాతానికి గురయ్యాయి. తీవ్రంగా గాయపడినా ఇద్దరూ బతికేఉన్నారని వైద్యులు చెప్పారు. వారి వివరాలను వెల్లడించలేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement