పదిమంది జవాన్లను మింగిన మంచు | Sakshi
Sakshi News home page

పదిమంది జవాన్లను మింగిన మంచు

Published Thu, Jan 26 2017 2:00 PM

పదిమంది జవాన్లను మింగిన మంచు

శ్రీనగర్ :
68వ గణతంత్రదినోత్స వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలోనే దేశ ప్రజలకు ఓ విషాద వార్త తెలిసింది. గుర్జు సెక్టర్లో రెండు వేర్వేరు చోట్ల మంచు తుఫానులో చిక్కుకొని పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.  ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మంచులో ఇరుక్కున్న మరో ఏడుగురు ఆర్మీ అధికారులు రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు జవాన్ల ఆచూకీ లభించాల్సి ఉంది.
 

Advertisement
Advertisement