లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత | Sakshi
Sakshi News home page

లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత

Published Wed, Nov 29 2017 1:34 AM

Snehalatha is the Secretary General of the Lok Sabha - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా స్నేహలతా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈమేరకు లోక్‌సభ సెక్రటెరియట్‌ ఓ నోటిఫికేషన్‌ విడుదలచేసింది. ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ ఈమెనే కావడం విశేషం. పదవీ విరమణ చేయబోతున్న అనూప్‌ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్‌ 1న బాధ్యతలు చేపడతారు.ఆమె పదవీ కాలం 2018 డిసెంబర్‌ 30న ముగియనుంది. 1982 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన స్నేహలత ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు.  

Advertisement
Advertisement