విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం | Sakshi
Sakshi News home page

విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం

Published Mon, Jun 9 2014 8:09 PM

విద్యార్థుల మృతిపై సోనియా సంతాపం - Sakshi

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థులకు సోనియా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

సోనియా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్తో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగిఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్కు చెందిన విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలు విద్యార్థులు 24 మంది నదిలో గల్లంతయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement