ప్రధాని నరేంద్ర మోడీకి సోనియా లేఖ | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్ర మోడీకి సోనియా లేఖ

Published Tue, Jun 3 2014 11:57 AM

Sonia gandhi wrote letter to Narendra modi

న్యూఢిల్లీ :  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఆమె ఆ లేఖలో పేర్కొంటూ పోలవరం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని కోరారు.  ఇదే సమయంలో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృత అభివృద్ధికి, పెట్టుబడి అవకాశాలకు ఈ పునర్వ్యవస్థీకరణ వీలు కల్పించేలా  కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని వాటిని అమల్లోకి తేవాలని సోనియా ఈ సందర్భంగా తన లేఖలో పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement