వారు ముగ్గురూ స్నేహితులు. బాగా చదువుకున్న వారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి పేరుప్రతిష్టలు తెస్తారని తల్లిదండ్రులు ఆశించారు. అయితే వారి ఆశలను అడియాశలు చేశారు. జల్సాలకు అలవాటుపడి దొంగలు, దోపిడీదారులుగా మారిపోయారు. కన్నవారికి పుత్రశోకాన్నిమిగిల్చారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓ ముగ్గురు మిత్రులు చదువుతూనే దొంగనాలకు అలవాటు పడ్డారు. ఇష్టారాజ్యంగా దోపిడీలు చేస్తూ పోలీసులను బురిడీ కొట్టించారు. వీరిపై నిఘా వేసిన పోలీసులు గురువారం చాకచక్యంగా పట్టుకుని కటకటాలకు పంపారు. శుక్రవారం విచారణలు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చెన్నై కొడంగయ్యూరుకు చెందిన శ్రీనివాసన్, ముగప్పేర్కు చెందిన ఎల్.రాయన్ స్నేహితులు. తాంబరంలోని కాలేజీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీనివాసన్తో ప్లస్ 2 వరకు చదివిన అభిషేక్ తోడయ్యాడు. వీరు ముగ్గురు ఒక్కటిగా ఉంటూ అన్నిచోట్లకూ కలిసే వెళ్లేవారు. శ్రీనివాసన్ తండ్రి రాజశేఖర్ది తిరునెల్వేలి. గతంలో వారి బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. శ్రీనివాసన్ తన ఇద్దరు మిత్రులను తీసుకెళ్లాడు.
పెళ్లికి హాజరైన మహిళలంతా భారీ స్థాయిలో నగలు ధరించడం చూశారు. వాటిపై ఎల్లరాయన్ కన్నుపడింది. నగలు కాజేస్తే జీవితాంతం ఉల్లాసంగా గడపవచ్చని తన స్నేహితులకు నూరిపోశాడు. చెన్నై నుంచి రైలులో తిరునెల్వెలీ చేరారు. ముందుగానే సిద్ధం చేసుకున్న మోటార్బైక్ను రైల్వేస్టాండ్ నుంచి తీసుకుని రోడ్లలో వెళ్లే మహిళల మెడల్లోని బంగారు నగలను దోచుకున్నారు. అదే రోజు రాత్రి లాడ్జీల్లో బసచేసి ఆన్లైన్ ద్వారా ఏసీ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుని చెన్నైకి చేరుకుంటారు. ఏడాదిన్నర కాలంలో ఈ విద్యార్థులు 27 దొంగతనాలు చేశారు. నెల్లైలో తరచూ దొంగతనాలు జరగడం, నిందితులు పట్టుపడక పోవడం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది.
ఇటీవల ఒక మహిళను దోచుకునిపోతూ శ్రీనివాసన్ పట్టుబడడంతో విద్యార్థుల వ్యవహారం బట్టబయలైంది. శ్రీనివాసన్ ఇచ్చిన సమాచారంతో గురువారం చెన్నైకి చేరుకున్న పోలీసులు అభిషేక్ను పట్టుకుని వంద సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు నాయకత్వం వహించిన ఎల్లరాయన్ పట్టుబడితే మరో 60 సవర్ల నగలు దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాలేజీ ఎన్నికల్లో విద్యార్థుల సంఘాధ్యక్షునిగా పోటీచేసిన శ్రీనివాసన్ చోరీ సొమ్ముతో పాండిచ్చేరి నుంచి రూ.3 లక్షలతో మద్యం బాటిళ్లు తెప్పించి పంచిపెట్టాడు. మరికొంత సొమ్ముతో చెన్నైలో కాల్సెంటర్ను స్థాపించి అందమైన అమ్మాయిలను పనిలో చేర్చుకున్నాడు.
తమకు అనుకూలంగా వ్యవహరించే అమ్మాయిలకు అధిక జీతాలు చెల్లిస్తూ వారితో విలాసంగా తిరిగేవారు. మహాలక్ష్మి అనే యువతికి ఎల్లరాయన్ లక్షలాది రూపాయలు ఇచ్చేవాడు. పోలీసులు తనకోసం వెదుకుతున్నారని తెలుసుకున్న ఎల్లరాయన్ సదరు మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన మరో విద్యార్థి అభిషేక్ సైతం చెన్నైలో ఉద్యోగావకాశాల సంస్థను స్థాపించి, తన ఆశలను తీర్చినవారికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఎల్లరాయన్ తల్లిదండ్రులు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ముగప్పేరులో ఖరీదైన బంగ్లా ఉంది. తల్లిదండ్రులు దూరంగా ఉండడం వల్ల విలాసాలకు అలవాటుపడిన ఎల్లరాయన్కు అందుకు తగిన ఆదాయం కోసం దోపిడీ బాటపట్టాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి తల్లడిల్లిపోయారు. పరారీలో ఉన్న కుమారుడిని వెతికిపట్టుకుని జైల్లో పెట్టాలని పోలీసులను కోరారు. అభిషేక్ తల్లిదండ్రులది కన్యాకుమారి జిల్లా. ప్రభుత్వ రవాణాశాఖలో కండక్టర్గా పనిచేసి రిైటె రయ్యాడు. దొంగిలించిన నగలను అమ్మే బాధ్యతను అభిషేక్ తీసుకున్నాడు. జాబ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులను బోల్తాకొట్టించాడు. రూ.500లు కట్టి రిజిష్టరు చేసుకుంటే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించేవాడు. ఈ ముగ్గురు విద్యార్థులు తిరునెల్వేలోనే కాదు చెన్నై శివార్లలో సైతం దొంగతనాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
చదువుతూనే దొంగతనాలు
Published Sat, Jul 26 2014 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement