పంటకు నిప్పంటించి మంటల్లో దూకిన ముగ్గురు | Sakshi
Sakshi News home page

పంటకు నిప్పంటించి మంటల్లో దూకిన ముగ్గురు

Published Thu, Jul 9 2015 8:32 PM

Sugarcane crisis, three women attempt suicide

మాంద్యా(కర్ణాటక): రానురాను రైతులకు వ్యవసాయం మృత్యుపాశంగా మారుతోంది. కర్ణాటకలో ముగ్గురు మహిళా రైతులు అప్పుల బాధతాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారికున్న చెరుకు పంటకు నిప్పంటించి ఆ మంటల్లో దూకి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన పలువురుని కంట తడిపెట్టించింది. రాష్ట్రంలోని మాలిగిరి జిల్లాలో కొందరు మహిళా రైతులు చెరుకు పంట సాగు చేస్తున్నారు.

అయితే, కొన్ని షుగల్ మిల్స్ వారి చెరుకును తీసుకునేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. పంటకోసం తీసుకొచ్చిన రుణం ఎలా తీర్చాలో దిక్కుతోచని పరిస్థితి తలెత్తి నేరుగా తమ పంటకు నిప్పంటించి ఆ మంటల్లోకి దూకి ఆత్మాహుతికి పాల్పడ్డారు. సమీపంలోని పశువుల కాపరి మంటలు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటలు ఆర్పినప్పటికీ తీవ్రంగా కాలిపోవడంతో ముగ్గురు చనిపోయారు.

Advertisement
Advertisement