రాజ్నాథ్తో సుజనా చౌదరి భేటీ | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్తో సుజనా చౌదరి భేటీ

Published Thu, Jun 18 2015 4:42 PM

రాజ్నాథ్తో సుజనా చౌదరి భేటీ - Sakshi

న్యూఢిల్లీ: టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి.. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. గురువారం మధ్యాహ్నం సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో కలసి రాజ్నాథ్తో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఫిర్యాదు చేశారు.  ఓటుకు కోట్లు కేసు గురించి సుజనా చౌదరి చర్చించినట్టు సమాచారం. ఈ కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టవగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి ప్రమేయం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement