జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి నియమ, నిబంధనలతో ఒక ముసాయిదా(మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్-ఎంవోపీ)ను రూపొందించడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఎంవోపీని సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో అటార్నీ జనరల్ రోహత్గీ గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి ఈ విషయం తెలియజేశారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ముసాయిదా నియమావళిని రూపొందించడం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని, ఇది ప్రభుత్వంపై అనవసర భారం మోపుతుందని పేర్కొన్నారు. ఎంవోపీకి సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి విధానం లేదని, అందువల్ల దీనిని రూపొందించడం సాధ్యం కాదని వివరించారు. ముసాయిదాను రూపొందించడం కాకుండా...
కొలీజియం వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన ధర్మాసనాన్ని కోరారు. కొలీజియం వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకుగానూ వివిధ వర్గాల నుంచి న్యాయస్థానం సూచనలు, ప్రతిపాదనలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పాటు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి పలు సూచనలు అందాయి. వీటిని పరిశీలించిన అనంతరం న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ఎంవోపీని రూపొందించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను మెరుగు పరచడానికి మూడంచెల ప్రక్రియను ప్రతిపాదించింది. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నేరుగా నియమించాలని, కొలీజియం సమావేశాలకు సంబంధించిన మినిట్స్ను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులు తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వమైనా తీసుకున్నారా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని పేర్కొంది.
ముసాయిదా సాధ్యంకాదు
Published Fri, Nov 20 2015 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
యధార్థ సంఘటనల ఆధారంగా ‘100 క్రోర్స్’
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement