Sakshi News home page

తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలకు సుప్రీం కోర్టు నోటీసులు

Published Wed, Oct 8 2014 3:53 PM

సుప్రీం కోర్టు - Sakshi

న్యూఢిల్లీ: కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 బచావత్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో పొందపరచవద్దని ఏపి ప్రభుత్వం  సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.  ఈ పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచాకరణకు స్వీకరించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
**

Advertisement
Advertisement