సాక్షి, సూరత్ః: మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన నూతన పన్ను సంస్కరణ జీఎస్టీ ఆ కుటుంబానికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది. ఎంతలా అంటే తమకు జన్మించిన ముగ్గురు కుమార్తెలకు జీఎస్టీ పేరు స్ఫురించేలా నామకరణం చేసేలా. సూరత్కు చెందిన ఓ మహిళకు ఇటీవల ముగ్గురు కుమార్తెలు జన్మించగా వారికి జీఎస్టీ ఇనీషియల్స్ వచ్చేలా గరవి, శాంచి, తరవి అని పేర్లు పెట్టింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఒకే దేశం ఒకే పన్ను వ్యవస్థ జీఎస్టీతో తాము స్ఫూర్తి పొందామని అందుకే తమ చిన్నారులకు అలాంటి పేర్లు పెట్టామని తల్లి కంచన్ పటేల్ చెప్పారు.
గతంలో జీఎస్టీ అమలు సందర్భఃగా రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం కూడా తమ చిన్నారికి జీఎస్టీ అని పేరు పెట్టుకున్నారు. అదే రోజు ఛత్తీస్గర్లో చిన్నారికి జన్మ ఇచ్చిన ఓ జంట కూడా తమ బిడ్డకు అదే పేరు పెట్టారు.