* చేపల వేట పేలుడు పదార్థంతోనే పేలుళ్లు
* హైదరాబాద్ సహా ఐదు చోట్ల పేలుళ్లకు ఐఎం వాడింది ఇవే
* బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి
బెంగళూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి శ్రీరంగం కామేష్: హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ఇం డియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు ‘మీన్ తూటాల’ను వినియోగించినట్లు తాజాగా బయటపడింది. కర్ణాటకలోని తీర ప్రాంత మత్య్సకారులు చేపలవేటకు అక్రమంగా ఉపయోగించే పేలుడు పదార్థాన్నే ఉగ్రవాదులు వాడిన విషయం వెలుగులోకి వచ్చింది. 2010 నుంచి హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ సహా పుణే, ముంబై, బెంగళూరుల్లో జరిగిన ఐదు పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారీకి ‘మీన్తూటా’లను సేకరించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అఫాఖీ కీలక పాత్ర: దేశంలో విధ్వంసానికి కుట్రపన్నిన ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ ఇందు లో భాగంగా వివిధ నగరాల్లో పేలుళ్లకు వ్యూహ రచన చేశాడు. పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం సరఫరా బాధ్యతను 2010 నుంచి ఐఎం పేలుడు పదార్థం సరఫరా బృం దం (ఎక్స్ప్లోజివ్స్ మాడ్యుల్) చీఫ్గా వ్యవహరిస్తున్న హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. అఫాఖీ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 2009 వరకూ దేశంలో పేలుళ్లకు స్వయంగా అమ్మోనియం నైట్రేట్ను సేకరించిన రియాజ్ భత్కల్...తన కోసం తొమ్మిది రాష్ట్రాల పోలీసులు గాలిస్తుండటంతో మకాం పాకిస్తాన్కు మార్చాడు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థం సరఫరా బాధ్యతను అఫాఖీకి అప్పగించాడు. అఫాఖీ పాక్ యువతిని పెళ్లాడటం, తరచూ పాక్ వెళ్లొస్తుండటంతో అతన్ని ఈ‘పని’ కోసం ఎంచుకున్నాడు.
‘మీన్ తూటాల’పై కన్ను: భత్కల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అఫాఖీ పేలుడు పదార్థాల సేకరణకు అనేక మార్గాలు అన్వేషించి చివరకు ‘మీన్ తూటాల’పై కన్నేశాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతోపాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైర్ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్నకుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్స్ ప్రభావంతో చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. దీన్నే మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. ఇది నిషిద్ధం.
స్క్రాప్ వ్యాపారి సద్దాం ద్వారా సరఫరా...
కర్ణాటకలో మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)లో సభ్యుడైన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్ను అఫాఖీ పావుగా వాడుకున్నాడు. అతని ద్వారా మీన్ తూటాలను తెప్పిం చుకునేవాడు. స్నేహితులతో కలసి చేపల వేట కు వెళ్లేందుకంటూ సద్దాం చేత ఉడిపి, రత్నగిరిల నుంచి ‘మీన్ తూటాలు’ తెప్పించేవాడు. ఈ జనవరి 26న భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన రియాజ్ భత్కల్ దాని కోసం అఫాఖీ ద్వారా 8 కేజీల పేలుడు పదార్థం, 100 డిటోనేటర్లు సమీకరించాడు. కానీ ఆలోపే అఫాఖీ సహా సద్దాం తదితరులు అరెస్టు కావడంతో పోలీ సులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.
‘మీన్ తూటాల’తో ఉగ్ర దాడులు
Published Thu, Feb 26 2015 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement