న్యూఢిల్లీ: బొగ్గు వివాదంపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి మసి అంటలేదని, గనుల కేటాయింపంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేసింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలాబిరా గనిని కేటాయించడంలో ప్రధాని మన్మోహన్సింగ్ నిజాయితీగా, నిష్పక్షికంగా వ్యవహరించారంది. ఈ మేరకు 2005లో జరిగిన ఈ కేటాయింపు పరిణామాలను వివరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. తలాబిరా గనికి సంబంధించి అధికారులు తన ముందు ఉంచిన వివరాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే బొగ్గు శాఖ మంత్రి హోదాలో ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. హిందాల్కోకు గని కట్టబెట్టేందుకు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ను పక్కనపెట్టారన్న ఆరోపణలను తోసిపుచ్చింది. కేటాయింపు పత్రాలు అందుబాటులో ఉన్నందున సీబీఐ స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని పేర్కొంది. తలాబిరా గని కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ ఆదిత్య బిర్లా చైర్మన్పై కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్పై సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే. తనది తప్పయితే ప్రధానిదీ తప్పే అవుతుందని పరేఖ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
నిర్ణయం ఎందుకు మారిందంటే
బొగ్గు గని కేటాయింపుపై నిర్ణయం మారడంపై పీఎంఓ వివరణ ఇచ్చింది. బొగ్గు శాఖ నుంచి పీఎంఓకు వినతి అందిందని, దీంతో మొదట తీసుకున్న నిర్ణయం మారిందని వివరించింది. ప్రకటనలోని వివరాలు.. తలాబిరా-2, 3 గనులను హిందాల్కోకు కేటాయించాలని కోరుతూ 2005, మేలో కుమారమంగళం బిర్లా నుంచి పీఎంఓకు లేఖ అందింది. దీన్ని పరిశీలించి, నివేదిక పంపాలని బొగ్గు శాఖ అధికారులకు పీఎంఓ సూచించింది. ఆ గనులను కేటాయించాలంటూ బిర్లా నుంచి జూన్లో పీఎంవోకు మరో లేఖ వచ్చింది. దీన్నీ పీఎంవో బొగ్గు శాఖకు పంపింది. తర్వాత తలాబిరా-2 కోసం మూడు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ నైవేలీకి గని కేటాయించాలని నిర్ణయించిందంటూ బొగ్గుశాఖ అధికారులు పీఎంవోకు ఫైలు పంపారు.
అందులో హిందాల్కోకు గని కేటాయించొద్దంటూ బొగ్గు శాఖ మూడు కారణాలను పేర్కొంది. తలాబిరా-2ను హిందాల్కోకే కేటాయించాలని కోరుతూ 2005, ఆగస్టులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు. విద్యుత్ ప్లాంట్ల కంటే అల్యూమినియం ప్రాజెక్టుల వల్లే ఎక్కువ సంపద సృష్టి జరుగుతుందని, హిందాల్కోకు గని ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో బొగ్గుశాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. గనులను నెవైలీ కార్పొరేషన్కు కాకుండా హిందాల్కోకు కేటాయించాలనిసహేతుక కారణాలతో పీఎంవోకు చెప్పింది. దీంతో హిందాల్కోకు గనుల కేటాయింపుపై ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని వివరించింది.
దర్యాప్తును కాంగ్రెస్ నీరుగారుస్తోంది: బీజేపీ
ఈ స్కాంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని, ప్రధానిపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. గనుల కేటాయింపులో అధికారుల నిర్ణయానికి ప్రధాని ఎలా బాధ్యుడవుతారని కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. హిందాల్కోకు గని కేటాయించాలని నవీన్ ప్రధానికి లేఖ రాయడం తప్పు కాదని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది. నవీన్పై తప్పుడు ప్రచారానికే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.
ప్రధాని తప్పేం లేదు!
Published Sun, Oct 20 2013 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement