♦ మరింత సమర్థమైన ఇన్కాండిసెంట్ లైట్ బల్బు తయారీ
♦ కరెంట్ ఖర్చు పిసరంతే
ఎంఐటీ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
ఒకప్పటి ఇన్కాండిసెంట్ లైట్ బల్బుల కంటే తక్కువ కరెంటు ఖర్చయ్యే సీఎఫ్ఎల్ బల్బులను వాడటం మొదలుపెట్టామోలేదో వాటికంటే మెరుగైన ఎల్ఈడీ బల్బులొచ్చాయి. తాజాగా పాతతరం ఇన్కాండిసెంట్ బల్బులకు మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెరుగులు దిద్ది అత్యాధునిక బల్బును తయారుచేసింది. దీంతో ఎల్ఈడీకంటే దాదాపు పదిరెట్లు తక్కువ విద్యుత్తో పనిచేసే కొత్త బల్బులు రాబోతున్నాయి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టి వందేళ్లు దాటింది. టంగ్స్టన్ ఫిలమెంట్ వేడి నుంచి పుట్టే వెలుగులను పంచే ఈ బల్బు సామర్థ్యం చాలా తక్కువ. వాడే విద్యుత్లో 5 శాతం మాత్రమే వెలుతురుగా మారి ఉపయోగపడుతుంది. మిగతా 95శాతం వేడి రూపంలో వృథాగా పోతుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులు వృథా చేసే కరెంటు దాదాపు 86 శాతమని అంచనా.
రీసైకిల్ చేస్తే...
విద్యుత్ బల్బులు మరింత సమర్థంగా పనిచేసేందుకు ఎంఐటీ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని అవలంబించారు. వేడి రూపంలో వృథాగా గాల్లో కలుస్తున్న శక్తిని తిరిగి కాంతి రూపంలోకి మార్చారు. దీంతో టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు 40 శాతం సామర్థ్యంతో పనిచేసింది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఫిలమెంట్ చుట్టూ స్ఫటిక ఆకారపు గాజు తొడుగు ఏర్పాటు చేశారు. ఇది వెలుతురును ప్రసారం చేస్తూనే... వెలువడిన శక్తిని మళ్లీ దానిపైకే ప్రసారం చేసింది. అంటే.. ఫిలమెంట్ నిర్దిష్ట ఉష్ణోగ్రతలో ఉండేందుకు తక్కువ కరెంట్ సరిపోతుందన్నమాట. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ఎల్ఈడీల కంటే మూడు రెట్లు ఎక్కువగా అంటే దాదాపు 40 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. సంప్రదాయ 60 కాండిళ్ల బల్బు ఏడాదిపాటు రూ.100 విద్యుత్ ఖర్చు చేస్తే ఇది కేవలం రూ.10 ఖర్చు చేస్తుంది. సీఎఫ్ఎల్ బల్బులైతే రూ.20, ఎల్ఈడీ బల్బులైతే రూ.18 వరకూ ఖర్చు చేస్తాయని యూకేలోని ఎనర్జీ సేవింగ్ ట్రస్ట్ తెలిపింది.
- సాక్షి, హైదరాబాద్
లాభాలెన్నో...
కొత్తరకం ఫిలమెంట్ బల్బుతో కరెంటు ఆదాతోపాటు మరెన్నో లాభాలున్నాయి. ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ బల్బుల తయారీలో పర్యావరణహానికారక పదార్థాలను వాడతారు. కొత్త బల్బులకు ఈ అవసరం లేదు. అంతేకాకుండా ఫిలమెంట్ బల్బు వెలువరించే వెలుతురు సూర్యకాంతిని పోలి ఉంటుంది. కంటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. సీఎఫ్ఎల్, ఎల్ఈడీల నుంచి వచ్చే నీలం రంగు కాంతి మన నిద్రను చెడగొడుతుందని శాస్త్రవేత్తల అంచనా. కొత్త బల్బులతో ఈ సమస్య ఉండదు.
పాత బల్బుకు కొత్త షోకులు!
Published Thu, Jan 28 2016 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement