రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి

Published Fri, Apr 14 2017 8:35 AM

రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి

కోల్‌కతా: సెల్ఫీ మోజు మరో ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకుంటుండగా రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది.

హౌరాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు రైలు పట్టాలపై సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వారిని రైలు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ముగ్గురు మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement