రాయగడ : రాయగడ జిల్లాలో ఇద్దరు వివాహిత కుమార్తెలతో అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. వార్డు సభ్యురాలితో విభేదాలు, ఏడీఎం వేధింపులు కారణమని కొందరు పేర్కొన్నారు. కాగా, కుటుంబ కారణాలు కారణమని కొందరు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
జాజ్పూర్ జిల్లా గుమ్మ గ్రామానికి చెందిన ఉత్పల సుఖల కల్యాణసింగుపురం సమితి సికరపాయి గ్రామ పంచాయతీ బెల్కోన గ్రామంలో అంగన్వాడీ వర్కర్గా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు పింకి సుఖల, రింకి సుఖల. వారికి వివాహమైంది. పింకి సుఖలకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. అంగన్వాడీ వర్కర్ ఉత్పల సుఖలకు బెల్కోనలో వార్డు సభ్యురాలైన సుశీల మండంగికి మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రామ కల్యాణ సమితి నిధులకు సంబంధించి విభేదాలు తలెత్తాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్పల ఇద్దరు వివాహిత కుమార్తెలతో ఆదివారం తెల్లవారుజామున విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలిసిన వెంటనే కల్యాణసింగుపురం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆత్మహత్యపై పలు అనుమానాలు
ఉత్పల, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వార్డు సభ్యురాలితో విభేదాలు ఉండడమే కారణమైతే ఆమె ఒక్కర్తే ఆత్మహత్యకు పాల్పడి ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. జిల్లా ఏడీఎం వేధింపులు కారణమని కొందరు ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్గా రాజీనామా చేయాలని ఉత్పలపై ఏడీఎం ఒత్తిడి తేవడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్డీపీఓ వై.జగన్నాథం, తహసీల్దార్ గౌరచరణ్ పట్నాయక్, బీడీవో ప్రవీణ్కుమార్కు స్థానికులు చెప్పినట్లు తెలిసింది. వార్డు సభ్యురాలితో విభేదాలు, అధికారుల వేధింపులు ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండవచ్చునని, కుటుంబంలో ఏదో సమస్య తలెత్తి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ కారణాలతోనే వారు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
పరిహారం చెల్లించాలని ఆందోళన
ఉత్పల, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్యతో పింకి సుఖల నాలుగేళ్ల కుమార్తె అనాథగా మిగిలింది. వారి మృతిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు బెల్కోనలో రాస్తారోకో నిర్వహించారు. రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముగ్గురు మహిళల ఆత్మహత్య
Published Mon, Aug 8 2016 9:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement