టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Mon, May 28 2018 5:50 PM

Today News Roundup 28th May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రేపు సాయంత్రం లోకసభ స్పీకర్‌ను కలువనున్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజీనామాలు ఆమోదించండి లేదా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి’ అనేదే తమ నినాదమన్నారు. రాజీనామాలు చేసి ఇన్ని రోజులవుతున్నా ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనన్నారు.

‘ఉప ఎన్నికలకు మేము సిద్ధం’
సాక్షి, ఒంగోలు: తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రేపు సాయంత్రం లోకసభ స్పీకర్‌ను కలువనున్నట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

‘అమిత్ షాపై టీడీపీ గుండాలతో దాడి’
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ విమర్శించారు.

‘మోదీ వేరే దేశ ప్రధాని.. మౌనం సిగ్గుచేటు’
తూత్తుకుడి : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన ఘటనలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడంపై డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు.

పాకిస్తాన్‌ ఎన్నికలు: హిందూ ఓటర్లే అధికం
ఇస్లామాబాద్‌ : సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్‌ సిద్ధమైంది. జూలై 25న ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆస్పత్రికి సోనియా; బీజేపీకి రాహుల్‌ చురక
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు.

ప్రణబ్‌కు ఆహ్వానం పంపిన ఆర్‌ఎస్‌ఎస్‌...?
న్యూఢిల్లీ : ఆర్‌ఎస్‌ఎస్‌ జూన్‌ 7న నిర్వహించబోచే ‘తృతీయ వర్ష్‌ వర్గా’ శిక్షణ కార్యక్రమ వీడ్కోలు వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆహ్వానించినట్లు సమాచారం

మళ్లీ విజృంభించనున్న ‘ఎయిడ్స్‌’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎయిడ్స్‌ రహిత తరాన్ని అందించడానికి అవసరమైన సాధనాలు ఇప్పుడు మన వద్ద ఉన్నాయి’ అంటూ 2011, డిసెంబర్‌ 1వ తేదీన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్య ఓ కొత్త చొరవకు దారితీసింది.

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు; మహానాడులో కలకలం
సాక్షి, హైదరాబాద్‌/విజయవాడ: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు.

‘నారా కుటుంబాన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలి’
సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించారు.

రైతుకు మరో కానుక  
ఆర్మూర్‌ : దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా పంటల సాగుకు పెట్టుబడి సాయం అందజేసిన ప్రభుత్వం.. అన్నదాతలకు తాజాగా రైతు బీమా పథకం పేరిట మరో కానుక తీసుకొచ్చింది.

‘భారత పౌరసత్వం’పై రషీద్‌ స్పందన..
ముంబై : ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్.. ఇప్పడు హాట్ టాపిక్ అయ్యాడు.

బ్యాంకింగ్‌ స్కాంలతో భారీ నష్టం, కోట్లకు కోట్లు ఆవిరి
ఇండోర్‌ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న కుంభకోణాలు చూస్తూనే ఉన్నాం. ఈ కుంభకోణాలు బ్యాంకులను భారీ మొత్తంలో ముంచెత్తుతున్నాయి.

అవును.. 20 ఏళ్ల తర్వాత విడిపోతున్నాం
సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో మరో బ్రేకప్‌ ఖాయమైపోయింది. నటుడు అర్జున్‌ రామ్‌పాల్‌(45) తన భార్య మెహర్‌ జెసియా(47) నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement