ప్రమాద బాధిత కుటుంబానికి రెండు కోట్ల పరిహారం | Sakshi
Sakshi News home page

ప్రమాద బాధిత కుటుంబానికి రెండు కోట్ల పరిహారం

Published Fri, Mar 13 2015 3:18 PM

TRIBUNAL-CLAIM Road mishap victim's family gets Rs 1.86 cr compensation Thane,

థానే:  రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి 1.86  కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలంటూ ధానే  మోటార్ యాక్సిడెంట్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సభ్యులు, జిల్లా  జడ్జ్ ఎస్జే కులకర్ణి తీర్పు చెప్పారు.  2008లో  ఇంతియాజ్  ఇస్లామ్ ఉస్మాన్ లాంబే  అనారోగ్యంతో  బాధపడుతున్న తల్లిని  తీసుకొని ఆసుపత్రికి వెళ్లి  తిరిగి వస్తుండగా  రత్నగిరి  ప్రాంతంలోని మీరారోడ్డులో వేగంగా  దూసుకొచ్చిన ఒక ప్రయివేటువాహనం వీరి కారును ఢీకొట్టింది.    దీంతో ఇంతియాజ్, అతని తల్లి  అక్కడికక్కడే చనిపోయారు. దుబాయ్ లో సీనియర్ షిప్పింగ్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఇంతియాజ్  నెలసరి ఆదాయం రెండు లక్షల  రూపాయలు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి   2.38 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలన్న కుటుంబ సభ్యుల వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ ప్రమాదానికి కారణమైన  వాహన యజమాని, శైలేన్ కుమార్ తివారీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మొత్తాన్ని చెల్లించాలని తెలిపింది.
 

Advertisement
Advertisement