మంత్రులపై కుర్చీతో దాడి, ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

మంత్రులపై కుర్చీతో దాడి, ఇద్దరికి గాయాలు

Published Mon, Feb 29 2016 5:46 PM

Tripura ministers attacked with chair

త్రిపురలో ఘటన

అగర్తల: త్రిపురలో ఆరోగ్య, ప్రజాపనుల శాఖ మంత్రి బాదల్ చౌదరి, రవాణ శాఖ మంత్రి మాణిక్ దేలపై ఓ వ్యక్తి దాడి చేశాడు. సీపీఎం కార్యాలయంలో సమీర్ దేవ్ నాథ్(30) అనే వ్యక్తి కుర్చీతో వారిపై దాడి చేయడంతో మంత్రులు స్వల్పంగా గాయపడినట్టు పోలీసులు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.

ఆదివారం రాత్రి సమీర్ సీపీఎం కార్యాలయానికి వెళ్లి తన తండ్రికి తీవ్ర అనారోగ్యంగా ఉందని,  చికిత్సకు డబ్బులు అవసరమని సహాయం చేయవల్సిందిగా మంత్రులను కోరాడు. వారు స్పందించకపోవడంతో  కుర్చీతో బాదల్, మాణిక్ ల పై దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సీపీఐ-ఎం నాయకులు బిజన్‌దార్, గౌతమ్ దాస్  అక్కడే ఉన్నారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా సమీర్ కుటుంబ సభ్యులు సీపీఎం మద్దతుదారులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement