ప్రియురాలిని గన్‌మెన్‌ కాల్చి చంపి.. | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని గన్‌మెన్‌ కాల్చి చంపి..

Published Tue, Mar 22 2016 5:50 PM

ప్రియురాలిని గన్‌మెన్‌ కాల్చి చంపి..

అగర్తలా: ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపి.. ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడో గన్‌మెన్‌‌. ఈ ఘటన అగర్తలాలోని దురంజైనగర్‌ సమీపంలో చోటుచేసుకున్నట్టు మంగళవారం పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. త్రిపుర స్టేట్‌ రైఫిల్స్ (టీఎస్‌ఆర్‌) తొమ్మిదవ బెటాలియన్కు చెందిన గన్‌మెన్‌ మిర్నల్‌ దాస్‌ (32) తనుశ్రీ కర్మాకర్‌, (25) గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

గత రాత్రి విధుల అనంతరం యూనిఫాంతో తన ప్రియురాలు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ఎస్పీ, పోలీస్‌ కంట్రోల్‌ ఉత్తమ్‌ కుమార్‌ బౌమిక్‌ తెలిపారు. తన వద్ద ఉన్న తుపాకీతో ప్రియురాలిని కాల్చాడు. దాంతో ఆమె అక్కడిక్కడకే ప్రాణాలు విడిచింది. అనంతరం తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్పీ ఉత్తమ్‌ వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు గన్‌మెన్‌ దాస్‌ ప్రియురాలిని చంపడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement