దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న రెండు అధికారిక జెండాల ప్రదర్శనపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జమ్ముకశ్మీర్ లోని అన్ని ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాలు, అధికార కార్యక్రమాల్లో కొనసాగుతూ వస్తున్న రెండు జెండాల (మువ్వన్నెల జాతీయ జెండాతోపాటు ఎరుపురంగులోని జమ్ముకశ్మీర్ రాష్ట్ర జెండాను తప్పనిసరిగా ఉంచడం అనే) విధానాన్ని రద్దుచేస్తున్నట్లు, ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంటూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 అమలవుతున్నందున భారత రాజ్యాంగంతోపాటు ఆ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న రాజ్యాంగాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 అమలులోకి వచ్చినప్పటినుంచి రెండు జెండాల విధానం కొనసాగుతున్నది. అయితే గత ఏడాది మార్చిలో బీజేపీ- పీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు జెండాల విధానానికి స్వస్తిపలికే చర్యలు ఊపందుకున్నాయి. విషయం కోర్టు వరకు చేరగా.. రెండు జెండాల విధానం ఉండాల్సిందేనని నాలుగు రోజుల కిందటే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ ఆ నిర్ణయాన్ని అదే కోర్టుకు చెందిన విస్తృత ధర్మాసనం శుక్రవారం కొట్టేసింది. ఎరుపు రంగు జెండా లేకుండా కేవలం జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా ఆ రాష్ట్ర ప్రతిపత్తికి ఎలాంటి విఘాతం వాటిల్లదని తీర్పు సందర్భంగా కోర్టు పేర్కొంది.
మొదటి తీర్పును సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై విస్తృత ధర్మాసనం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. దశాబ్దాలుగా భారత్ లో అంతర్భాగమైనప్పటికీ జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక జెండా ఉందని, అది కశ్మీరీల గౌరవానికి సూచిక అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, శ్రీనగర్ లోని జమాయి మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం వేర్పాటువాద మూకలు అలజడి సృష్టించాయి. నమాజ్ అనంతరం పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన యువకులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలతోపాటు లష్కర్ నేత హఫీజ్ సయ్యద్ చిత్రపటాలను ప్రదర్శించారు. పోలీసులపైకి రాళ్లురువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులకు కష్టపడాల్సివచ్చింది.
జమ్ముకశ్మీర్లో రెండు జెండాల విధానం రద్దు
Published Fri, Jan 1 2016 5:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement