జమ్ములో మాజీ మిలిటెంట్ పైకాల్పులు | Sakshi
Sakshi News home page

జమ్ములో మాజీ మిలిటెంట్ పైకాల్పులు

Published Sat, Jul 16 2016 12:26 PM

Two injured in militant attack in Kashmir

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.  తారీఖ్ అహ్మద్ పండిట్ పోలీసు శాఖలో ఉండి, అనంతరం ఉగ్రవాదిగా మారి బర్హాన్ వనీ గ్రూపులో చేరాడు. ఈ యేడాది మేలో పోలీసులకు లొంగిపోయాడు.  తారీఖ్ అహ్మద్ అతని సోదరునిపై ఉగ్రవాదులు నిన్న రాత్రి పుల్వామా జిల్లాలోని కరీమాబాద్ లో కాల్పులు జరిపారు. తీవ్రంగా  గాయపడిన ఇద్దరిని శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరళించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
 

Advertisement
Advertisement