శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాబలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. బలగాలకు, ఉగ్రవాదులకు మధ్యజరిగిన కాల్పుల్లో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందినవారని జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. వీరు ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందినవారై ఉండొచ్చన్నారు. హంద్వారాలోని యూనిసో గ్రామంలో గాలింపు జరుపుతున్న భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే ప్రతిస్పందించిన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించారన్నారు.
బ్యాంకు భద్రతాసిబ్బందిపై కాల్పులు– ఇద్దరు మృతి
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో కెల్లెర్ పట్టణంలో ఉన్న జమ్మూ, కశ్మీర్ బ్యాంకు వాహనంపైకి గుర్తుతెలియని సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీగార్డులు తీవ్రంగా గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.
#UPDATE: The said encounter took place in Handwara's Unisoo & not in Baramulla as reported earlier. 3 terrorists were gunned down & one civilian also lost her life during the operation. #JammuandKashmir
— ANI (@ANI) December 11, 2017